Header Banner

ఏపీ కియా కంపెనీలో కలకలం! ఏకంగా 900 కార్ల ఇంజన్లు మాయం..!

  Tue Apr 08, 2025 11:46        Others

మన దేశంలో కియా కార్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలంలోని యర్రమల్లి పంచాయతీలోని కియా ప్లాంట్‌లో ఇటీవల అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 ఇంజన్లను ఎత్తుకెళ్లినట్లు యాజమాన్యం గుర్తించింది. ఈ సంఘటన పరిశ్రమలో కలకలం రేపగా, తొలుత మౌనంగా వ్యవహరించిన ప్లాంట్ యాజమాన్యం రహస్యంగా పోలీసులతో దర్యాప్తు ప్రారంభించింది. అయితే అధికారిక ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేయడం కష్టమని పోలీసులు స్పష్టంగా తెలిపిన అనంతరం, కియా యాజమాన్యం చివరకు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చింది.

 

ఇది కూడా చదవండిరైలులో ప్రయాణం చేస్తున్నారా.? బాబోయ్.. ఇకపై ఎంత అంటే అంత లగేజీని తీసుకెళ్తే అంతే సంగతులు!

గత నెల 19న ఈ ఇంజన్ల మాయమయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని ప్రధాన కియా ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న విడిభాగాల తయారీ సంస్థల నుంచి వస్తున్న భాగాలను తరలించే ప్రక్రియలోనే ఈ భారీ నష్టం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ హయాంలో స్థాపించబడిన ఈ కియా ప్లాంట్ మొదటినుంచి ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిశ్రమ మాజీ ఉద్యోగులే ఈ భారీ దొంగతనానికి పాల్పడిన అవకాశమున్నట్లు ప్రాథమికంగా తేలింది. దీంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #KiaEngineHeist #KiaCarScandal #APNews #KiaIndia #900EnginesMissing